ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీస్ స్టేషన్​ పైనుంచి దూకిన నిందితుడు

నర్సీపట్నంలో పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి ఓ నిందితుడు కిందకు దూకేశాడు. క్షతగాత్రుణ్ణి పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

By

Published : Sep 14, 2019, 1:51 PM IST

Updated : Sep 15, 2019, 1:12 PM IST

నిందితుడు ఆత్మహత్యాయత్నం

పోలీస్ స్టేషన్​ పైనుంచి దూకిన నిందితుడు

విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీస్ స్టేషన్​లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. నర్సీపట్నం సమీపంలోని పినారిపాలెంకు చెందిన సంతోష్ తో పాటు మరో ఇద్దరినీ పోలీస్ వాహనం పై దాడి చేసిన ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్​కు తీసుకువచ్చి విచారించారు. పోలీసులు వేధింపులకు మనస్థాపం చెందిన సంతోష్ భవనంపై నుంచి కిందకు దూకాడు. అతని కాలుకు తీవ్రగాయమైంది. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వేధింపు వల్లే సంతోష్ ప్రాణాలు తీసుకోవాలనే ప్రయత్నం చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

Last Updated : Sep 15, 2019, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details