ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెడ్​జోన్​లో వలసకూలీలకు పాస్​ల జారీపై స్పష్టత ఏదీ..?

వలస కూలీలు స్వస్థలాలకు చేరేలా లాక్​డౌన్​ నిబంధనలు సడలించడం వల్ల విజయవాడలో సబ్​ కలెక్టర్​ కార్యాలయం రద్దీగా మారింది. అయితే వీరికి పాస్​ల జారీ విషయంలో స్పష్టత కొరవడి.. ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ పెద్దలే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు తమను త్వరగా స్వస్థలాలకు చేర్చాలని వలస కార్మికులు వేడుకుంటున్నారు.

By

Published : May 2, 2020, 4:44 PM IST

రెడ్​జోన్​లో వలసకూలీలకు పాస్​ల జారీపై స్పష్టత ఏదీ..?
రెడ్​జోన్​లో వలసకూలీలకు పాస్​ల జారీపై స్పష్టత ఏదీ..?

పాస్​ల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పిస్తున్నారని వలస కూలీల ఆవేదన

స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని వలస కూలీలు విజయవాడ సబ్​కలెక్టర్​ కార్యాలయానికి పోటెత్తారు. అధికారులు వారి నుంచి వివరాలు సేకరించి పంపిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 4 వేల మంది స్వస్థలాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రెడ్​జోన్​ కావడం వల్ల వారికి ఏ విధంగా పాస్​లు ఇవ్వాలనేదానిపై అధికార వర్గాల్లో స్పష్టత కొరవడింది.

ప్రభుత్వ పెద్దలే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సబ్​కలెక్టర్​ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అయితే తమ సమస్యను పరిష్కరించడం లేదని వలసకార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమను త్వరగా తమ ప్రాంతాలకు చేర్చాలని కోరుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details