ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 12, 2021, 8:53 PM IST

Updated : May 12, 2021, 9:00 PM IST

ETV Bharat / city

వేగంగా వ్యాక్సిన్లు అందిచాలన్న సదుద్దేశంతోనే... ప్రధానికి లేఖ: జోగి రమేష్​

రోజురోజుకూ కరోనా వల్ల ప్రజలు ఇబ్బంది పడడాన్ని తగ్గించే సదుద్జేశంతోనే సీఎం జగన్..​ ప్రధానికి లేఖ రాసినట్లు వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్​ తెలిపారు. తెదేపా నేతలు కావాలనే రచ్చ చేస్తున్నారని ఆయన ఆగ్రహించారు.

వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్
వేగంగా వ్యక్సిన్లు అందిచాలని సదుద్దేశ్యంతోనే ప్రధానికి లేఖ

వీలైనంత త్వరగా అందరికీ వాక్సిన్లు వేసేందుకు.. ప్రజా ప్రయోజనం కోసమే కోవాగ్జిన్ టెక్నాలజీ ఫార్ములాను ఇతర వాక్సిన్ తయారీ సంస్ధలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీని కోరారని.. ఆ పార్టీ స్పష్టం చేసింది. కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలనే గొప్ప మనసుతో సీఎం... ప్రధానికి లేఖ రాస్తే తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆయన అనుకూలమైన వారంతా హైరానా పడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు.

ప్రజల ప్రాణాల కన్నా.. తమకు భారత్ బయోటెక్ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా వ్యవరిస్తున్నారని అన్నారు. కోవాగ్జిన్ టెక్నాలజీ ఫార్ములాను వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం, అనుభవం ఉన్న మిగతా సంస్థలకు కూడా పంచి.. త్వరితగతిన అందరికీ వ్యాక్సిన్లు వేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు జోగి తెలిపారు. ఈ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయని ఆయన అన్నారు. అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిచడం తగదన్నారు.

Last Updated : May 12, 2021, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details