ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ హోలీ శుభాకాంక్షలు

ప్రజల్లో సోదరభావాన్ని హోలీ బలోపేతం చేస్తుందని గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్​ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన పండుగ శుభాకాంక్షలు జరిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

By

Published : Mar 28, 2021, 4:34 PM IST

Published : Mar 28, 2021, 4:34 PM IST

governor convey holi wishes, governor wished public happy holi
గవర్నర్ హోలీ శుభాకాంక్షలు, ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ రంగురంగుల శక్తివంతమైన పండుగ అన్నారు. ప్రజల్లో సోదరభావాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, శ్రేయస్సును ఈ పండుగ సూచిస్తుందని చెప్పారు. రంగులు చిలకరించడం, ఆనందాలను పంచుకోవటం ద్వారా జాతీయ సమైక్యతపై మన నమ్మకాన్ని, విశ్వాసాన్ని బలపరుస్తుందన్నారు.

అన్ని సామాజిక అడ్డంకులను అధిగమించి.. సత్యానికున్న శక్తిని, చెడుపై మంచి సాధిస్తున్న విజయాన్ని హోలీ సూచిస్తుందని గవర్నర్ తెలిపారు. కరోనా నిబంధనలను అనుసరించి.. మాస్క్​లు పెట్టుకుని, సామాజిక దూరం పాటిస్తూ ఇంట్లో పండుగను జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అర్హత ఉన్న అందరూ ముందుకు వచ్చి టీకాలు వేయించుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details