ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బద్వేల్ ఎమ్మెల్యే, రోడ్డు ప్రమాద మృతులకు గవర్నర్ సంతాపం

బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణం, నెల్లూరు జిల్లా దామరమదుగు రోడ్డు ప్రమాదం భాకరమంటూ.. రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్​ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు ధైర్యం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు.

By

Published : Mar 28, 2021, 4:58 PM IST

Published : Mar 28, 2021, 4:58 PM IST

governor condolences to badvel mla death, governor condolences to damaramadugu road accident deaths
బద్వెల్ ఎమ్మెల్యే మృతిపట్ల గవర్నర్ విచారం, దామరమదుగు రోడ్డు ప్రమాద మృతులకు గవర్నర్ సంతాపం

కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఎస్వీ వైద్యకళాశాలలో ఆర్థోపెడిక్స్​లో ఎంఎస్ చేసి ఆర్థోపెడిక్ సర్జన్‌గా పని చేశారని గుర్తు చేసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందడం బాధాకరమన్నారు. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమదుగు రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల గవర్నర్ విచారం వ్యక్తం చేశారు. శ్రీశైలం ఆలయం నుంచి తిరిగి వస్తున్న 8 మంది యాత్రికులు మరణించగా మరో నలుగురు గాయపడటం బాధాకారమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details