ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ప్రభుత్వం లీవ్‌ పిటిషన్ ‌

By

Published : Apr 19, 2021, 4:05 PM IST

Updated : Apr 19, 2021, 4:43 PM IST

Government leave petition in AB Venkateswara Rao case
ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ప్రభుత్వం లీవ్‌ పిటిషన్ ‌

15:47 April 19

ఏబీవీ కేసులో ప్రభుత్వం లీవ్‌ పిటిషన్

ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ప్రభుత్వం హైకోర్టులో లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఏబీ కేసులో వాదనలు వినిపిస్తామని పిటిషన్​లో పేర్కొంది.  

రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో గతంలో అనిశా ఆయనపై కేసు నమోదు చేసింది. కేసు నమోదుకు ముందే ఏబీ వెంకటేశ్వరరావు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఏబీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని  హైకోర్టు ఆదేశాలిస్తూ..మార్చి 8న తీర్పు రిజర్వ్ చేసింది. దర్యాప్తులో హైకోర్టుల జోక్యం తగదన్న సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ...ప్రభుత్వం ఇవాళ పిటిషన్ దాఖలుచేసింది. కేసులో తమ వాదనలు వినాలని పిటీషన్​లో ప్రభుత్వం కోరింది.

ఇదీచదవండి:  'జగన్ కుటుంబసభ్యుల అరెస్టుకు ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఒత్తిడి'

Last Updated : Apr 19, 2021, 4:43 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details