ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు'

శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా..మరొకరికి ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నం చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీలు మండిపడ్డారు.

By

Published : Jul 23, 2019, 6:57 PM IST

తెదేపా శాసనమండలి సభ్యులు

తెదేపా శాసనమండలి సభ్యులు

శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా వాయిదా వేస్తుందని తెదేపా ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ఈ 9 రోజుల్లో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార పార్టీ చాలావరకు సమాధానాలు దాటవేసిందని విమర్శించారు. మద్యం విధానంపై అధికార పార్టీ సభ్యులే ప్రశ్న అడిగి.. వారే వాయిదా కోరటం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మరొకరికి ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details