ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది: గంటా

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అచ్చెన్నాయుడును అరెస్టు చేయటాన్ని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తప్పుబట్టారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని విమర్శించారు.

By

Published : Jun 12, 2020, 1:48 PM IST

Published : Jun 12, 2020, 1:48 PM IST

ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించింది: గంటా
ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించింది: గంటా

అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారంలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు నోటీస్ ఇచ్చి విచారణ చేపడతారని..సరైన సమాధానం రాకుంటే అప్పుడు అరెస్ట్ చేస్తారని తెలిపారు. ఎలాంటి నోటీస్ లేకుండా పోలీస్ బలగాలతో బలవంతంగా అరెస్ట్ చేయటం సరైంది కాదన్నారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోకుంటే వీటన్నింటికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details