దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని దుర్గ, భవానీ, పద్మావతి ఘాట్ల దగ్గర స్నానాలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజికి వరద ప్రవాహం మరో 4 రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు బ్యారేజికి వస్తుందని తెలిపారు. వచ్చిన నీటిని వచ్చినట్లు విడుదల చేస్తున్నామన్నారు. ఘాట్ల వద్ద ప్రమాదకర పరిస్థితి ఉండటంతో నది లోపలికి అనుమతి లేదన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా స్నానాలకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.