ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తెదేపా.. కేంద్రానికి మద్దతు తెలపాలని తీర్మానించడం హాస్యాస్పదం'

మహానాడులో తెదేపా.. కేంద్రానికి అంశాల వారీగా మద్దతు తెలపాలని తీర్మానించడం హాస్యాస్పదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న భాజపాకు ఏ విధంగా మద్దతిస్తారని ప్రశ్నించారు.

By

Published : May 29, 2021, 4:16 PM IST

cpi ramakrishna
cpi ramakrishna

కరోనా కట్టడిలో కేంద్రం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రధానిని మార్చాలని భాజపా ,ఆర్ఎస్ఎస్ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తుంటే .. తెదేపా మాత్రం మహానాడులో కేంద్ర ప్రభుత్వానికి అంశాలవారీగా మద్దతు తెలపాలని తీర్మానించడం హాస్యాస్పదమన్నారు.

విభజన హమీలు, ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోని కేంద్రానికి ఏ అంశాలలో మద్దతు తెలిపారో చెప్పాలన్నారు. అలాగే... మోదీ సహకారం లేకుండా రాజధానిపై నిర్ణయం తీసుకోవడం ముఖ్యమంత్రి జగన్​కు సాధ్యమేనా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details