రవాణా రంగంలో ఆటోలది కీలకపాత్ర. నగరాల్లో ప్రయాణ అవసరాలను తీర్చుతూ..ఆటోవాలాలు సేవలందిస్తున్నారు. ఆటోలపై ఆధారపడి వేలాది మంది నిరుద్యోగులు జీవనం సాగిస్తున్నారు. ఏడాది క్రితం వరకు సాఫీగా సాగిన ఆటోవాలాల జీవితాలు కరోనా వైరస్తో తలకిందులయ్యాయి. గతేడాది మార్చిలో లాక్డౌన్తో వేలాది ఆటోవాలా కుటుంబాలు అతలాకుతమలమయ్యాయి. ఫైనాన్స్ సంస్థల వేధింపులు, అప్పుల బాధతో చాలా మంది ఆటోవాలాలు ఆత్మహత్యలకూ పాల్పడ్డారు. లాక్డౌన్ అనంతరం పరిస్థితులు కాస్త మెరుగుపడగా...ఇప్పుడిప్పుడే కష్టాల నుంచి తేరుకుంటున్నారు. ఈ సమయంలో వచ్చిన కరోనా సెకండ్ వేవ్ ఆటోవాలాల జీవితాలను తిరిగి కష్టాల పాల్జేసింది.
తగ్గిన ప్రయాణికులతో పూట గడవని పరిస్థితి
రవాణా రంగం హబ్గా పేరొందిన విజయవాడలో పదివేలకు పైగా ఆటోలు తిరుగుతుంటాయి. అతి పెద్ద బస్టేషన్, రైల్వే జంక్షన్లు నగరంలో ఉండటంతో పెద్దఎత్తున ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరందరినీ వారి గమ్యస్థానాలకు చేర్చడంలో ఆటోవాలాలది కీలక పాత్ర. కరోనా దెబ్బకు రైళ్ల రాకపోకలు, బస్సుల సంఖ్య కుదించటంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో ఆటోవాలాల జీవనోపాధికి గండి పడింది. వచ్చే కొద్ది మంది ప్రయాణికులూ కరోనా భయంతో వ్యక్తిగత వాహనాల, క్యాబ్లను ఆశ్రయిస్తుండటంతో ఆటోవాలాలకు పూట గడవని పరిస్థితి ఏర్పడింది.
ఆత్మహత్యలే శరణ్యం