ఆంధ్రప్రదేశ్

andhra pradesh

KLU POSTER: కేఎల్​యూ ఫెస్ట్ పోస్టర్ ఆవిష్కరించిన చంద్రబాబు

కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు నిర్వహిస్తున్న సాంస్కృతిక ఫెస్ట్ పోస్టర్​ను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ రెండు రోజులపాటు నిర్వహించే సాంకేతిక, సాంకేతికేతర అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు.

By

Published : Nov 11, 2021, 5:32 PM IST

Published : Nov 11, 2021, 5:32 PM IST

కేఎల్​యూ ఫెస్ట్ పోస్టర్ ఆవిష్కరించిన చంద్రబాబు
కేఎల్​యూ ఫెస్ట్ పోస్టర్ ఆవిష్కరించిన చంద్రబాబు


కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు 'ఎక్స్​పాటికా' పేరిట నిర్వహిస్తున్న సాంస్కృతిక ఫెస్ట్ పోస్టర్​ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో ఆవిష్కరించారు. మేనేజ్​మెంట్ విభాగం విద్యార్థులు ఈ నెల 19, 20వ తేదీల్లో నిర్వహించే సాంకేతిక, సాంకేతికేతర అంశాలతో సాంస్కృతిక విభాగంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు.. చంద్రబాబుకు వివరించారు.

దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. కార్యక్రమంలో మేనేజ్​మెంట్ విభాగాధిపతి పి. వెంకశ్వేరరావు, విద్యార్థులు ధర్మవర్థన్, రవీంద్ర, అరుణ్ తేజ, చైతన్య, శుష్మంత్, నిహారిక తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి.. సీఎం భయపడుతున్నారు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details