కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు 'ఎక్స్పాటికా' పేరిట నిర్వహిస్తున్న సాంస్కృతిక ఫెస్ట్ పోస్టర్ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆవిష్కరించారు. మేనేజ్మెంట్ విభాగం విద్యార్థులు ఈ నెల 19, 20వ తేదీల్లో నిర్వహించే సాంకేతిక, సాంకేతికేతర అంశాలతో సాంస్కృతిక విభాగంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు.. చంద్రబాబుకు వివరించారు.
KLU POSTER: కేఎల్యూ ఫెస్ట్ పోస్టర్ ఆవిష్కరించిన చంద్రబాబు
కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు నిర్వహిస్తున్న సాంస్కృతిక ఫెస్ట్ పోస్టర్ను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ రెండు రోజులపాటు నిర్వహించే సాంకేతిక, సాంకేతికేతర అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు.
కేఎల్యూ ఫెస్ట్ పోస్టర్ ఆవిష్కరించిన చంద్రబాబు
దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. కార్యక్రమంలో మేనేజ్మెంట్ విభాగాధిపతి పి. వెంకశ్వేరరావు, విద్యార్థులు ధర్మవర్థన్, రవీంద్ర, అరుణ్ తేజ, చైతన్య, శుష్మంత్, నిహారిక తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: