ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి పురపాలక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని సినీ హాస్యనటుడు అలీ ప్రజలకు పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలన్నదే జగన్ తపన అని వ్యాఖ్యానించారు. ప్రచారం అనంతరం భవానీపురం దర్గాలో అలీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
'అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే సీఎం జగన్ తపన'
అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్ తపన అని సినీ హాస్యనటుడు అలీ వ్యాఖ్యానించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆయన..సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరారు.
!['అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే సీఎం జగన్ తపన' అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే సీఎం జగన్ తపన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10896228-546-10896228-1615026961109.jpg)
అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే సీఎం జగన్ తపన