రోజూ రెండు పూటలా సరిపడా సుమారు 35 వేల ఆహార పదార్థాల ప్యాకెట్లను తిరుపతి నగర వ్యాప్తంగా వితరణ చేసేలా తిరమల తిరుపతి దేవస్థానం ప్రణాళికలు రచించింది. తితిదే చేపట్టిన ఈ భారీ అన్న ప్రసాద వితరణతో ఎంతో మంది ప్రజలకు కడపు నిండుతోంది. లాక్ డౌన్ నిబంధనల కారణంగా.. దిక్కు లేని పరిస్థితి ఎదుర్కొంటున్న వారి సమస్యకు మార్గం లభించినట్టైంది.
నగర వ్యాప్తంగా తితిదే అన్న ప్రసాద వితరణ
లాక్డౌన్ కారణంగా తిరుపతిలో ఉపాధి కోల్పోయి.. తిండిలేక అవస్థలు పడుతున్న పేద ప్రజలకు తితిదే అన్నదానం చేస్తోంది. రెండు పూటలకు సరిపడా ఆహారాన్ని ప్యాకెట్ల ద్వారా నగర వ్యాప్తంగా పంపిణీ చేసింది.
తిరుపతి నగర వ్యాప్తంగా తితిదే అన్నప్రసాద వితరణ
TAGGED:
latest news of tirupati