ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చంద్రబాబు భద్రతా సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు

By

Published : Apr 13, 2021, 9:24 AM IST

Updated : Apr 13, 2021, 1:02 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు బస చేస్తున్న బస్సును తిరుపతి పోలీసులు పరిశీలించారు. నిన్నటి ప్రచార సమయంలో... దాడి ఘటనకు సంబంధించి భద్రతా సిబ్బందిని ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

chandrababu
చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లదాడి

తెదేపా అధినేత చంద్రబాబు తిరుపతిలో బస చేస్తున్న బస్సును పోలీసులు పరిశీలించారు. చంద్రబాబు కాన్వాయ్‌ను వీడియో తీశారు. సోమవారం దాడి ఘటనపై భద్రతా సిబ్బందిని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యక్తిగత, భద్రతా సిబ్బందిని ఆరా తీశారు. రాళ్లు వేసిన వారిని చూశారా..? రాళ్లు ఎటు వైపు నుంచి వచ్చాయో గమనించారా..? అని అడిగారు. రాళ్ల దాడి ఘటనపై తెదేపా నేతల ఫిర్యాదుతో తిరుపతి పశ్చిమ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.

Last Updated : Apr 13, 2021, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details