ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి దర్శనం నిలిపివేత.. ఇది అవాస్తవం!

తిరుమల శ్రీవారి దర్శనాన్ని జూన్‌ 30 వరకు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని... సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తితిదే స్పష్టం చేసింది. ఇలాంటి ప్రచారం చేస్తే చర్యలు తప్పవని దేవస్థాన సమాచార విభాగం హెచ్చరించింది.

By

Published : Apr 29, 2020, 5:18 PM IST

suspension of srivari darshan is unreal
అసత్య ప్రచారం నమ్మొద్దు

తిరుమల శ్రీవారి దర్శనాన్ని జూన్‌ 30 వరకు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై తితిదే స్పందించింది. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించడంపై ధర్మకర్తల మండలి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని దేవస్థాన సమాచార విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details