ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 11, 2020, 11:03 AM IST

ETV Bharat / city

చిత్తూరు జిల్లాలో తెదేపా నేతల గృహ నిర్బంధం

చంద్రబాబు తిరుపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో పలువురు తెదేపా నేతలను గృహ నిర్బంధం చేశారు. ఐతేపల్లిలో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్‌ నరసింహయాదవ్​లను గృహ నిర్బంధం చేశారు.

tdp-leaders-house-arrest-in-tirupathi
tdp-leaders-house-arrest-in-tirupathi

చిత్తూరు జిల్లాలో తెదేపా నేతలను గృహ నిర్బంధం చేశారు పోలీసులు. చంద్రబాబు పర్యటన దృష్ట్యా పోలీసుల ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఐతేపల్లిలో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్‌ నరసింహయాదవ్​లను గృహనిర్బంధం చేశారు. శాంతిపురం మండలం వెంకటేపల్లిలో తెదేపా నేత జి.శ్రీనివాసులు, తెదేపా ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులునూ గృహ నిర్బంధించారు.

చిత్తూరు జిల్లాలో తెదేపా నేతల గృహనిర్బంధం

తిరుపతిలో చంద్రబాబు తలపెట్టిన అమరావతి పరిరక్షణ ర్యాలీ జరిగి తీరుతుందని తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు. శాంతియుత ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడం దారుణమన్నారు. తమను గృహ నిర్బంధం చేయడంపై నేతలు మండిపడ్డారు. మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్ నరసింహ యాదవ్ ఇళ్ల ఎదుట కార్యకర్తలు...ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించే వరకు పోరాడతామని నేతలు హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details