సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో కిలోమీటర్ల మేర భక్తులు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ పెరిగింది.
సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర భక్తులు వేచి చూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటలు పడుతుంది. నిన్న శ్రీవారిని 79,957 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 38,842 మంది భక్తులు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.85 కోట్లుగా తేలింది.