ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మోదీజీ..హామీలు గుర్తులేవా : లోకేశ్

తెదేపా అవినీతి చేసినట్లు రుజువులు చూపించాలని మోదీని లోకేశ్ ప్రశ్నించారు. ప్రధాని ప్రత్యేక హోదా పై ఒక్క మాట మాట్లాడలేదని లోకేశ్ మండిపడ్డారు

By

Published : Feb 10, 2019, 3:35 PM IST

Updated : Feb 10, 2019, 4:46 PM IST

లోకేశ్

మోదీ వ్యాఖ్యల పై స్పందించిన లోకేశ్
ప్రధాని మోదీ వ్యాఖ్యల పై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తెదేపా అవినీతికి పాల్పడినట్లు రుజువు చూపాలని మోదీకి సవాలు విసిరారు. ప్రత్యేక హోదా , రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ మోదీకి గుర్తురావన్నారు. మోదీ సభకు వైకాపా..జనాలను తరలించిందని ఆరోపించారు. కావాలనే రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు.
"నా పై అవినీతి వ్యాఖ్యలు చేయడం దారుణం. విదేశాల్లో చదువుకున్నా ... రెండేళ్లు ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేశా. ప్రజలకు సేవ చేయడం కోసం అన్నీ వదులకుని వచ్చా."- నారా లోకేశ్
మోదీ పర్యటనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత నిరసన చేశామని లోకేశ్ తెలిపారు. ప్రజలంతా స్వచ్ఛందంగా రోడ్ల పైకి వచ్చారన్నారు.
Last Updated : Feb 10, 2019, 4:46 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details