ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైకాపాను రద్దు చేయాలి'

రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించే కుట్రకు పూనుకుని జగన్ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ ఆరోపించారు. తెరాసతో చేతులు కలిపి ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని విమర్శించారు.

By

Published : Mar 7, 2019, 10:37 AM IST

Updated : Mar 7, 2019, 10:46 AM IST

కారెం శివాజీ

కారెం శివాజీ
తెలంగాణ నేతలతో జగన్ చేతులు కలిపి.. ఏపీలో 8 లక్షలు ఓట్ల తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని తిరుమలలోకారెం శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారం-7 ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న జగన్.. తీవ్రవాది కంటే పెద్ద నేరస్థుడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చింతమనేని మాటలను వక్రీకరించి వైకాపా కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వైకాపాను ఈసీ రద్దు చేయాలని... లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
Last Updated : Mar 7, 2019, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details