తిరుపతి ఉప ఎన్నిక(లోక్సభ)కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 17న ఎన్నిక నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈనెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాగా తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గా ప్రసాద్ రావు(వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ స్థానానికి వైకాపా తరుపున డా. గురుమూర్తి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.
తిరుపతి ఉపఎన్నిక: ఏప్రిల్ 17న ఎన్నికలు.. మే 2న ఫలితాలు
Published : Mar 16, 2021, 4:55 PM IST
Published : Mar 16, 2021, 4:55 PM IST
|Updated : Mar 16, 2021, 5:32 PM IST
tirupati by election
16:50 March 16
షెడ్యూల్ విడుదల
మరోవైపు తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
- మార్చి 30 వరకు నామినేషన్లకు గడువు
- మార్చి 31న నామినేషన్ల పరిశీలన
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 3
- ఏప్రిల్ 17న పోలింగ్
- మే 2న ఫలితాలు
ఇదీ చదవండి
జగన్ గారూ.. నంద్యాల ఉపఎన్నిక ఫలితంపై ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి..?
Last Updated : Mar 16, 2021, 5:32 PM IST