ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుపతి ఉపఎన్నిక: ఏప్రిల్​ 17న ఎన్నికలు.. మే 2న ఫలితాలు

By

Published : Mar 16, 2021, 4:55 PM IST

Published : Mar 16, 2021, 4:55 PM IST

Updated : Mar 16, 2021, 5:32 PM IST

tirupati by election
tirupati by election

16:50 March 16

షెడ్యూల్ విడుదల

షెడ్యూల్

తిరుపతి ఉప ఎన్నిక(లోక్​సభ)కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్‌ 17న ఎన్నిక నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈనెల 23న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాగా తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గా ప్రసాద్‌ రావు(వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ)  ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ స్థానానికి వైకాపా తరుపున డా. గురుమూర్తి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. 

మరోవైపు తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. 

  • మార్చి 30 వరకు నామినేషన్లకు గడువు
  • మార్చి 31న నామినేషన్ల పరిశీలన
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 3
  • ఏప్రిల్ 17న పోలింగ్
  • మే 2న ఫలితాలు


 

ఇదీ చదవండి

జగన్​ గారూ.. నంద్యాల ఉపఎన్నిక ఫలితంపై ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి..?

Last Updated : Mar 16, 2021, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details