ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ ఆర్పీఠాకూర్ పేర్కొన్నారు. రూ.18 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఆయన శంకుస్ధాపన చేశారు. ఐజీ క్రాంతిరాణా టాటా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మైదానంలో మొక్కలు నాటారు.