చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని కరకంబాడి రోడ్డు బొమ్మల క్వార్టర్స్ లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భారీ భవనం నీటి తొట్టెలో పడి ఐదు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. భవన యజమాని సరైన జాగ్రత్తలు తీసుకోక నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ బిడ్డ నీటితొట్టిలో పడి మరణించాడంటూ అలిపిరి పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు కేసు పెట్టారు. తల్లిదండ్రుల వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వినోద్ కుమార్ తెలిపారు.
భారీ భవనం నీటి తొట్టెలో పడి ఐదేళ్ల బాలుడు మృతి
తిరుపతికి సమీపంలోని కరకంబాడి రోడ్డు బొమ్మల క్వార్టర్స్ లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భారీ భవనం నీటి తొట్టెలో పడి ఐదు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు.
child died