ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుపతి అర్బన్ ఎస్పీకి చంద్రబాబు లేఖ.. కారణం?

తిరుపతి అర్బన్ ఎస్పీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తెదేపా పోలింగ్ బూత్ ఏజెంట్లు, సానుభూతిపరులపై వేధింపులు ఆపాలంటూ డిమాండ్ చేశారు. సాధారణ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం తెదేపా నేతలు, ఏజెంట్లపై రామచంద్రాపురం పీఎస్‌లో కేసులు పెట్టారన్నారు. తమ నాయకులను అదుపులోకి తీసుకోవాలంటూ వైకాపా నేతలు పోలీసుల్ని బెదిరిస్తున్నారన్నారు.

By

Published : Jul 14, 2020, 11:32 PM IST

Published : Jul 14, 2020, 11:32 PM IST

చంద్రబాబు
చంద్రబాబు

తమ పార్టీ శ్రేణులపై వేధింపులు ఆపాలంటూ తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలో తెదేపా పోలింగ్ ఏజెంట్లు, సానుభూతిపరులపై రౌడీషీట్లు తెరవడాన్ని తప్పుబట్టారు. 2019 సాధారణ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం జరిగిన సంఘటనల్లో.. కావాలనే తమ నేతలపై కేసులు పెట్టారన్నారు. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు తగవని చెప్పారు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 9 మంది తెదేపా ఏజెంట్లు, సానుభూతిపరులపై కేసులు నమోదు చేశారని లేఖలో వివరించారు.

కౌన్సిలింగ్ పేరుతో తెదేపా నేతలను పోలీస్ స్టేషన్ కి పిలిచి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెదేపా కార్యకర్తలను అదుపులోకి తీసుకోకపోతే వైకాపా కార్యకర్తలు పోలీసులను బెదిరిస్తున్నారన్నారు. స్థానిక వైకాపా నాయకులకు కొందరు పోలీసులు అనుకూలంగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details