ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 23, 2020, 8:25 PM IST

ETV Bharat / city

సొంత గూటికి చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్

మాజీ ఎంపీ హర్షకుమార్ తిరిగి కాంగ్రెస్​ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్​ఛార్జి ఉమెన్ చాందీ..హర్షకుమార్​కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Ex mp harsha kumar
Ex mp harsha kumar

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్

మాజీ ఎంపీ హర్షకుమార్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చెరుకూరి కన్వెన్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్​ఛార్జి ఉమెన్​ చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సమక్షంలో హర్షకుమార్ కాంగ్రెస్​లో చేరారు. ఉమెన్​ చాందీ హర్షకుమార్​కు కాంగ్రెస్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కాంగ్రెస్​ శ్రేణులు నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details