ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీసు వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సీఎం చర్యలు: మంత్రి కన్నబాబు

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సీఎం జగన్ చర్యలు చేపట్టారని మంత్రి కన్నబాబు అన్నారు. కాకినాడ మూడో ఏపీఎస్పీ బెటాలియన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ మంగళవారం జరిగింది.

By

Published : Sep 8, 2020, 12:53 PM IST

minister kannababu
మంత్రి కన్నబాబు

కాకినాడ మూడో ఏపీఎస్పీ బెటాలియన్ పాసింగ్ అవుట్ పరేడ్ మంగళవారం జరిగింది. 119 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కన్నబాబు, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్ చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు. పోలీసు వ్యవస్థకు గౌరవం తీసుకువచ్చేలా నడుచుకోవాలని మంత్రి హితవు పలికారు. పోలీసు వ్యవస్థలోనే ఏపీఎస్పీ బెటాలియన్ ఎంతో కీలకమైనదని.... విపత్తు సమయాల్లో వీరి సేవలు అభినందనీయమని మంత్రి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details