Retired Railway Head Constable Suicide: పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్లో రైల్వే విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్య వర్ధన్ రైల్వే హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తూ 45 రోజుల క్రితం వీఆర్ఎస్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్న అతను ఉరి వేసుకని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పుల బాధ వల్లనే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రైల్వే రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం అదేనా?
Retired Railway Head Constable Suicide: రైల్వే క్వార్టర్స్లోనే రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Railway Head Constable Suicide