ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎకరానికి రూ.25 వేలు పరిహారం అందించాలి'

వర్షాలు, వరదల్లో నష్టపోయిన రైతులకు భరోసా కల్పించేందుకు సీఎం జగన్ కనీసం క్షేత్రస్థాయి పర్యటన చేయలేదని ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు విమర్శించారు. నష్టపోయిన రైతులకు.. ఎకరానికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

By

Published : Oct 19, 2020, 8:55 PM IST

ganni veranjaneyulu
ganni veranjaneyulu

రెండు నెలలుగా భారీ వర్షాలు, వరదలతో రైతులు నష్టపోతుంటే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కనీసం క్షేత్రస్థాయి పర్యటన చేయలేదని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. ఏలూరు తెదేపా కార్యాలయంలో ఆయన నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

జిల్లా తెదేపా నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గన్ని వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.25 వేల రూపాయలు పరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details