ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్టీఆర్ విగ్రహానికి ముసుగు వేసిన అధికారులు..!

NTR Statue Issue : ఏలూరు జిల్లా పెదపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వివాదాలకు దారితీసింది. ప్రధాన కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి ఏర్పాటు చేశారు. అనుమతి లేదని పోలీసులు, అధికారులు తొలగించేందుకు సమాయత్తమయ్యారు.

By

Published : May 21, 2022, 1:20 PM IST

NTR statue set up issue in Pedapadu
NTR statue set up issue in Pedapadu

NTR Statue Issue : ఏలూరు జిల్లా పెదపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వివాదాలకు దారితీసింది. ప్రధాన కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి ఏర్పాటు చేశారు. పాత దిమ్మెపైనే ఎన్టీఆర్ కొత్త విగ్రహాన్ని అభిమానులు, తెదేపా కార్యకర్తలు ఏర్పాటు చేశారు. అయితే.. అనుమతి లేదని పోలీసులు, అధికారులు తొలగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో తెదేపా కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో.. ఉద్రిక్తత తలెత్తే పరిస్థితి కనిపించడంతో.. తెదేపా నాయకులతో అధికారులు మాట్లాడారు. విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదని, అందువల్ల అనుమతి తెచ్చుకోవాలని.. అప్పటి వరకు విగ్రహానికి ముసుగు వేస్తున్నట్లు తెలిపారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details