ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM

.

By

Published : Jun 19, 2020, 9:01 PM IST

ప్రధాన వార్తలు @ 9PM
ప్రధాన వార్తలు @ 9PM

  • పెద్దల సభకు..

రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. గెలుపొందిన పిల్లి సుభాష్​ చంద్రబోస్​, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల ఆయోధ్యరామి రెడ్డి, పరిమళ్ నత్వానిలకు పలువురు అభినందనలు తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా

తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గుంటూరు జీజీహెచ్​కు వెళ్లారు. అక్కడి సూపరింటెండెంట్‌ను కలిసి అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ట్యాక్సీ యజమానులను ఆదుకోండి

లాక్​డౌన్ సడలింపుల తర్వాత ట్యాక్సీ యజమానుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ట్యాక్సీ యజమానుల ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని... ఇలాంటి సమయంలో పర్మిట్ ఫీజు, రోడ్డు పన్ను రద్దు చేసి వారిని ఆదుకోవాలని జనసేనాని కోరారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వీర జవాన్లకు కేసీఆర్‌ ఆర్థికసాయం

చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన 19 మంది సైనికుల కుటుంబ సభ్యులకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయం ప్రకటించారు. కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పాక్ కుట్ర భగ్నం

పంజాబ్​లో వరుస దాడులు, హత్యలకు కుట్రపన్నిన ఇద్దరు ఖలిస్థాన్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి పాకిస్థానీ ఉగ్రవాద సంస్థలతో, ఐఎస్​ఐతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చైనాతో వివాదంపై చర్చ

చైనాది ప్రజాస్వామ్యం కాదు. వారిది నియంతృత్వం. వారు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. మరోవైపు మనం ఐకమత్యంగా ముందుకు సాగుతాం. భారత్​దే అంతిమ విజయం.. చైనా ఓడిపోక తప్పదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చైనా వస్తువులను నిషేధిస్తే నష్టమెవరికి?

భారత సైనికుల మృతికి కారణమైన చైనాపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. చైనా వస్తువులను నిషేధించాలని, వారి సంస్థలను దేశం నుంచి బహిష్కరించాలని చర్చ నడుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏటా 100 కోట్ల మంది చిన్నారులపై హింస

సరైన రక్షణ చర్యలు లేక ఏటా సుమారు వందకోట్ల మంది చిన్నారులు హింసకు గురవుతున్నారని ఐరాస ఓ నివేదికలో తెలిపింది. బాలలకు భద్రత కల్పించడంలో ఆయా దేశాలు విఫలమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పాక్ క్రికెటర్లకు రెండుసార్లు కరోనా పరీక్షలు!

జూన్ 28న ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లబోయే పాక్​ క్రికెటర్లకు.. రెండుసార్లు కరోనా టెస్టులు చేయనున్నారు.​ వీటిలో ఎవరైనా పాజిటివ్​గా తేలితే, వారిని అక్కడే నిలుపుదల చేస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రజనీకాంత్​కు బాంబు బెదిరింపు అతడి పనే!

సూపర్​స్టార్​ రజనీకాంత్​ ఇంట్లో బాంబు ఉందని ఫేక్​ కాల్ చేసిన వ్యక్తిని తమిళనాడు పోలీసులు గుర్తించారు. అతను ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడని తేల్చారు. మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న అతడిని వైద్య రికార్డులు పరిశీలించిన అనంతరం వదిలిపెట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details