ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM

.

By

Published : Jul 19, 2020, 9:00 PM IST

9pm top new
ప్రధాన వార్తలు @9 pm

  • అత్యధిక కరోనా కేసులు, మరణాలు
    రాష్ట్రంలో కొత్తగా 5,041 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మెుత్తం కేసుల సంఖ్య 49,650కి చేరింది. వైరస్ కారణంగా తాజాగా మరో 56 మంది మృతి చెందగా.. మెుత్తం మరణాలు 642కు చేరుకున్నాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలి'
    రాయలసీమలో రాజధాని ఉండాలని 90 ఏళ్లుగా సీమవాసులు కలలు కంటున్నారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. కర్నూలుకు హైకోర్టు ప్రకటించినా.. ఇంక కార్యరూపం దాల్చలేదన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • మూడు ముక్కలాట కక్ష పూరితం
    అమరావతికి నాడు జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం వాస్తవం కాదా అని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ప్రశ్నించారు. నేడు వికేంద్రీకరణ పేరుతో మూడు ముక్కలాట కక్ష పూరితం కాదా అని ఆయన నిలదీశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • దేవినేని సీతారామయ్య కన్నుమూత
    బ్రహ్మయ్య అండ్ కంపెనీలో సీనియర్ భాగస్వామి దేవినేని సీతారామయ్య (96) కన్నుమూశారు. హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • నేపాల్​ పోలీసుల కాల్పులు
    బిహార్​లోని సరిహద్దు ప్రాంతమైన కిషన్​గంజ్​ వద్ద నేపాల్​ పోలీసులు దుస్సాహసానికి పాల్పడ్డారు. భారత్​-నేపాల్​ సరిహద్దు ప్రాంతంలో ముగ్గురు భారతీయులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ భారతీయుడు గాయపడ్డాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • హింసాత్మకంగా నిరసనలు
    బంగాల్​లో​ ఓ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు అనేక వాహనాలను తగలబెట్టారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • దోమల వల్ల కరోనా వ్యాప్తి చెందదు!
    దోమ కాటు వల్ల కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతుందా అన్న దానిపై పరిశోధన చేశారు అమెరికా శాస్త్రవేత్తలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కీటకాల ద్వారా మహమ్మారి వ్యాప్తి చెందదని తేల్చి చెప్పారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 6 లక్షలు దాటిన మరణాలు
    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ మరణాలు 6లక్షలు దాటాయి. మొత్తం మీద 6,05,813 మంది వైరస్​ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 1,44,65,556 కేసులు వెలుగుచూశాయి. దక్షిణాఫ్రికాలో వైరస్​ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. హాంగ్​కాంగ్​లో ఇదే పరిస్థితులు నెలకొనడం వల్ల.. ఆంక్షలు మరింత కఠినం చేశారు అధికారులు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'ధోనితో పోలిస్తే గంగూలీ ఆ విషయంలో ఉత్తమం'
    ధోనీతో పోలిస్తే సౌరభ్ గంగూలీ నాయకత్వం టీమ్​ఇండియాపై ఎక్కువ ప్రభావం చూపిందని అన్నాడు భారత క్రికెటర్​ పార్థివ్​ పటేల్​. కెప్టెన్​గా మహీ మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించినా.. ఆందోళనలో ఉన్న జట్టును తిరిగి నిర్మించడంలో గంగూలీ ప్రధానపాత్ర వహించాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • ఎందుకు గుర్తొస్తుంది?
    బాలీవుడ్​ యాక్షన్​ హీరో అక్షయ్​ కుమార్​ భార్య, నటి ట్వింకిల్​ ఖన్నా సమాజంలో మహిళలపై చూపిస్తున్న వివక్ష గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుటుంబంలో బాధ్యతలను పురుషులు, మహిళలు సమానంగా పంచుకోవాలని అన్నారు. లింగభేదం చూపించడం సరికాదని పేర్కొన్నారు.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details