బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టర్లు, ఎస్పీలు, జడ్పీ సీఈవోలతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో సీఎస్ ఆదిత్యనాథ్దాస్, డీజీపీ గౌతం సవాంగ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, నామినేషన్లు, ఓటర్ల జాబితా రూపకల్పనపై ఉన్నతాధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చర్చించనున్నారు. ఈ సమీక్షకు హాజరుకావాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
రేపు ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్.. కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
సుప్రీంకోర్టు తీర్పుతో స్థానిక ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. బుధవారం ఉదయం 11గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ సమావేశం కానుంది. ఈ సమీక్షకు అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరుకావాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్లతో ఏపీ ఎస్ఈసీ వీడియోకాన్ఫరెన్స్.