ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'3 నెలల్లోనే రూ.18వేల కోట్ల అప్పు... ఖజానా ఖాళీ చేసిందెవరు?'

ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యాఖ్యలపై తెదేపా నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. పరిపాలన చేతకాక తెలుగుదేశంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. పరిశ్రమలన్నీ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్లిపోతున్నాయని... ఖజానా తాళం తీస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని సూచించారు.

By

Published : Oct 23, 2019, 7:40 PM IST

Published : Oct 23, 2019, 7:40 PM IST

tdp-leader-payyavulakesav

పరిపాలన చేతకాక.. తెదేపాపై విమర్శలు

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని పీఏసీఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు.పాలన చేతకాక ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు.అమరావతిని చంపేసే ప్రయత్నం చేసి డబ్బుల్లేవని గోల చేస్తున్నారని ఆక్షేపించారు.గతంలో తాము సరాసరి22వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే...ఈ ప్రభుత్వం3నెలల్లో18వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని దుయ్యబట్టారు.పరిశ్రమలు బెంగళూరు,చెన్నై,హైదరాబాద్‌కు పోతున్నాయి తప్ప...రాష్ట్రం వైపు చూడటం లేదని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details