కరోనా బారిన పడినవారు ఇంటి నుంచే దాన్ని జయించేందుకు వీలుగా ఇప్పటికే అందిస్తున్న టెలీ వైద్యసేవల్ని జూన్ 15 వరకూ పొడిగిస్తున్నట్లు హెల్పర్ ఫౌండేషన్ సీవోవో డా.అనూప్ తెలిపారు. అమెరికాలోని ప్రవాసాంధ్ర వైద్యులైన జనరల్ ఫిజీషియన్లు డా.హిమబిందు, డా.హరీష్, డా.ధీరజ్, డా.భానుప్రకాశ్, డా.సురేష్, డా.అచ్యుత్, పల్మనాలజిస్ట్ డా.విఖ్యాత్, ఎండోక్రైనాలజిస్ట్ డా.సుధ, సాంక్రమిక వ్యాధుల నిపుణురాలు డా.సుభద్రలు కొవిడ్ బాధితులకు అవసరమైన టెలీ వైద్యం, సూచనలు, సలహాలు అందిస్తారని వివరించారు. నిర్దేశిత సమయాల్లో బాధితులు ఎవరైనా సరే జూమ్ కాల్ ద్వారా సేవలు పొందవచ్చని చెప్పారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, లాస్ఏంజిల్స్ తెలుగు అసోసియేషన్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
టెలీవైద్యసేవలు అందుబాటులో ఉండే తేదీలు, సమయాలు
*మే 24 నుంచి 28 వరకూ, జూన్ 1, 8, 10, 15 తేదీల్లో సాయంత్రం 6.30 గంటలకు
*మే 31, జూన్ 6, 8, 10, 12 తేదీల్లో ఉదయం 7 గంటలకు
*జూన్ 3, 4, 5, తేదీల్లో ఉదయం 8 గంటలకు
*మే 29న రాత్రి 8.30 గంటలకు
*జూన్ 12, 13, 14 తేదీల్లో సాయంత్రం 4.30 గంటలకు