ఎంఎస్సీ నర్సింగ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేసినట్లు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు/సెప్టెంబర్ నెలల్లో నిర్వహించాల్సిన పరీక్షలను కరోనా కారణంగా వాయిదా వేసినట్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పరీక్షల నిర్వహణ తేదీని తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది.