ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Telangana: చిరు, ఎన్టీఆర్​తో తెలంగాణ మంత్రి పువ్వాడ భేటీ.. ఎందుకంటే?

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆయన తనయుడు నయన్ రాజ్​లు మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరో ఎన్టీఆర్​ను కలిశారు. నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా భేటీ అయినట్లు మంత్రి ట్వీట్ చేశారు.

By

Published : Jul 5, 2021, 3:18 PM IST

Published : Jul 5, 2021, 3:18 PM IST

puvvada ajay kumar
చిరు, ఎన్టీఆర్​తో తెలంగాణ మంత్రి పువ్వాడ ప్రత్యేక భేటీ

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆయన కుమారుడు పువ్వాడ నయన్ రాజ్​​తో కలిసి మెగాస్టార్ చిరంజీవి, స్టార్​హీరో ఎన్టీఆర్​తో భేటీ అయ్యారు. డా. పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా చిరు, తారక్​లను కలిసినట్లు మంత్రి ట్వీట్ చేశారు.

చిరును కలిసిన పువ్వాడ

పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు మంత్రి ట్వీట్ చేశారు. చిరు సమక్షంలో నయన్ రాజ్ కేక్ కట్ చేశారు.

ఎన్టీఆర్​కు పుష్పగుచ్చం ఇస్తున్న మంత్రి

అనంతరం.. తారక్​ను కలిశారు. తన కుమారుడు నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా మర్యాదపూర్వకంగా వీరిని కలిసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ భేటీలో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఉన్నారు. నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా చిరు, ఎన్టీఆర్​లను పువ్వాడ కలవడం ఆసక్తికరంగా మారింది.

చిరు సమక్షంలో కేక్ కటింగ్
ఎన్టీఆర్​తో పువ్వాడ ప్రత్యేక భేటి

ఇదీ చదవండి:

ఏపీకి అన్యాయం జరుగుతోంది.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు సీఎం జగన్ లేఖ

ABOUT THE AUTHOR

...view details