ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 11, 2020, 9:33 PM IST

ETV Bharat / city

మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే దాడికి పాల్పడ్డారు: మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి

తంబళ్లపల్లెలో తెదేపా నేతలపై దాడి ఘటనను తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఖండించారు. మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

vas reddy
vas reddy

తంబళ్లపల్లెలో తెదేపా నేతలపై మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే దాడికి పాల్పడ్డారని తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టకుండా గాయపడిన వారిని అరెస్టు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ తక్షణమే స్పందించి బాధ్యులను శిక్షించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details