తెదేపా ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నిలయంగా ఉన్న ఆంధ్రప్రదేశ్... వైకాపా 2 ఏళ్ల పాలనలో అప్పులు, అరాచకాలకు కేరాఫ్గా మారిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు దుయ్యబట్టారు.
"దొంగ చేతికి తాళాలిచ్చినట్లు ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని నాశనం చేశారు. 90 శాతం పైగా పథకాలు అప్పులతో అమలు చేస్తూ నవరత్నాల పేరుతో సంక్షేమానికి అరకొర నిధులిచ్చి ప్రజల్ని మోసగిస్తున్నారు. ఒక్క పరిశ్రమ తీసుకురాకుండా, ఏ ప్రాజెక్టూ పూర్తి చేయకుండా పేదలకు ఇళ్లు నిర్మించకుండా.. అప్పు మాత్రం రూ.1.65లక్షల కోట్లు పైబడి చేశారని దుయ్యబట్టారు. తెచ్చిన అప్పు తీర్చటానికి మళ్లీ అప్పు చేస్తూ ఒక్కో కుటుంబంపై రూ.2.50లక్షల భారం మోపారు" - కళా వెంకట్రావు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు