ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP Corona Casess: రాష్ట్రంలో కొత్తగా 16,167 కరోనా కేసులు, 104 మరణాలు నమోదు

By

Published : May 27, 2021, 5:32 PM IST

Updated : May 27, 2021, 6:19 PM IST

huge-corona-cases-registered-in-andhrapradhesh
రాష్ట్రంలో కొత్తగా 16,167 కరోనా కేసులు, 104 మరణాలు నమోదు

17:27 May 27

AP Corona Casess: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న మరో 21,385 మంది బాధితులు

రాష్ట్రంలో కొత్తగా 16,167 కరోనా కేసులు, 104 మరణాలు నమోదు

రాష్ట్రంలో కరోనా కేసులు(AP Corona Casess) తగ్గుతున్నా మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గురువారం కొత్తగా 16,167 కరోనా కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,43,557కు చేరింది. మరణాల సంఖ్య 10,531కు ఎగబాకింది. వైరస్ నుంచి మరో 21,385 మంది కోలుకోగా ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 14,46,244కు పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,86,782 కరోనా యాక్టివ్ కేసులు(AP Corona Casess) ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 84,224 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.  

జిల్లాల వారీగా కరోనా మృతులు...  

కొవిడ్ వల్ల చిత్తూరులో 14, పశ్చిమ గోదావరిలో 13, విశాఖపట్నంలో 11, అనంతపురంలో 9, నెల్లూరులో 9, గుంటూరులో 8, విజయనగరంలో 8, ప్రకాశంలో 7, తూర్పు గోదావరిలో 6, కృష్ణా లో 6, కర్నూలులో 6, శ్రీకాకుళంలో 6, కడపలో ఒక మరణం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.  

ఇదీచదవండి.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ఈడీ ఛార్జ్‌షీట్

Last Updated : May 27, 2021, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details