ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"విద్యా ప్రమాణాల మెరుగు కోసం ప్రణాళికలు సిద్ధం"

By

Published : Sep 24, 2019, 6:51 PM IST

రాష్ట్రంలోని కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని కళాశాలలు ర్యాంకింగ్​ల కోసం పోటీ పడాలని అభిప్రాయపడ్డారు.

higher-education-chairman-relesed-app

"విద్యా ప్రమాణాల మెరుగు కోసం ప్రణాళికలు సిద్ధం"

కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టిందని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న కొన్ని కళాశాలలు మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయని...అలా కాకుండా ప్రతి కళాశాల ర్యాంకింగ్​ల కోసం పోటీ పడాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ర్యాంకింగ్ కోసం దరఖాస్తు చేసుకునే కళాశాలలకు సాంకేతిక సహకారం అందించడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్​ను ఆయన ఆవిష్కరించారు. ర్యాంకింగ్​లకు సంబంధించి కళాశాలకు ఎలాంటి సందేహాలున్నా యాప్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details