ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి హైకోర్టు నివాళి

By

Published : Sep 15, 2020, 7:10 AM IST

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ లక్ష్మణ్​ మృతిపై హైకోర్టు నివాళి అర్పించింది. వారు దేశానికి చేసిన సేవలను కొనియాడింది.

Hc Condolences To Pranabmukarjee in ap
Hc Condolences To Pranabmukarjee in ap

ఇటీవల కన్నుమూసిన భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ లక్ష్మణ్​కు హైకోర్టు నివాళి అర్పించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులందరూ పాల్గొని నివాళులర్పించారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జస్టిస్ లక్ష్మణ్​ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశానికి వారు అందించిన సేవలను కొనియాడారు. హైకోర్టు న్యాయమూర్తులతో పాటు ఏజీఎస్ శ్రీరామ్, బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details