ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత

మాజీ డీజీపీ ప్రసాదరావు మరణించారు. ఛాతి నొప్పితో అమెరికాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

By

Published : May 10, 2021, 9:27 AM IST

Published : May 10, 2021, 9:27 AM IST

Updated : May 10, 2021, 11:18 AM IST

former dgp prasada rao died
former dgp prasada rao died

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ డీజీపీ ప్రసాదరావు అమెరికాలో మరణించారు. ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రసాదరావు కన్నుమూశారు. బయ్యారపు ప్రసాదరావు 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. అ.ని.శా. డీజీగా, ఆర్టీసీ ఎండీగా, హోంశాఖలో కార్యదర్శిగా ప్రసాదరావు సేవలందించారు. హైదరాబాద్ సీపీగా, విశాఖ ఎస్పీగా ప్రసాదరావు పనిచేశారు. 1997లో పోలీసు పతకం, 2006లో రాష్ట్రపతి పతకం అందుకున్నారు. 'వర్డ్ పవర్ టు మైండ్ పవర్' అనే పుస్తకం రాశారు.

మాజీ డీజీపీ ప్రసాదరావు మృతి పట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రసాదరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో నేటి నుంచి ఈ పాస్​ విధానం అమలు: డీజీపీ

Last Updated : May 10, 2021, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details