ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిపై.. మంటలు రేపుతున్న మాటలు

రాజధాని అమరావతి ముంపు ప్రాంతమా? నిర్మాణ వ్యయం పెరుగుతోందంటున్న మంత్రి బొత్స వ్యాఖ్యల వెనక ఆంతర్యమేంటి? రాజధాని తరలిపోతుందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయా? అసలేం జరుగుతోంది?

By

Published : Aug 21, 2019, 10:10 PM IST

capital

అమరావతిపై.. మంటలు రేపుతున్న మాటలు

అమరావతిలో ఏం జరుగుతోంది..? రాజధాని భవిష్యత్ ఏం కానుంది.. ? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతున్న అంశం ఇది..! కిందటి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిన అమరావతిని.. ఈ ప్రభుత్వం పక్కనపెట్టడంపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. రాజధానిపై మంత్రులు మంత్రులు.. వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. అమరావతి ముంపు ప్రాంతమని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వాదనలు తీవ్ర దుమారం రేపుతుండగా.. ఎంపీ విజయ్‌సాయి రెడ్డి చేస్తున్న ట్వీట్‌లు, వ్యాఖ్యలు మరింత హీట్ పెంచుతున్నాయి. విమర్శలు ప్రతివిమర్శలతో మైకులు మోతెక్కిపోతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details