కొవిడ్ నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్టణం రీజనల్ ఆఫీస్ పరిధిలోని పరిశ్రమలు కలసి 1 కోటి 5లక్షల 50 వేలు విరాళం ఇచ్చాయి. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని కలిసిన ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పీసీబీ మెంబర్ సెక్రటరీ విజయ్కుమార్, ఏపీపీసీబీ విశాఖపట్నం రీజనల్ ఆఫీసర్ ప్రమోద్కుమార్ రెడ్డి చెక్కును అందజేశారు.