ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 14, 2020, 7:48 PM IST

ETV Bharat / city

డిప్యూటీ స్పీకర్ పద్మారావు జీ.. మాస్క్ ధరించకపోతే ఎలా?

తెలంగాణలోని సికింద్రాబాద్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్​ మాస్క్ ధరించకుండా బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కరోనా బారిన పడిన ఆయన.. ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే మళ్లీ బయటికి రావడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

deputy-speaker-padma-rao-goud-attented-bonalu-procession-without-mask-in-secunderabad
బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ స్పీకర్

బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ స్పీకర్

తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వ్యవహారశైలి మరోసారి వివాదాస్పదమైంది. ఇటీవల మంత్రి కేటీఆర్ ఓ కార్యక్రమంలో.. పద్మారావు మాస్క్ ధరించకుండా జాగ్రత్తలు తీసుకోకుండా ఉండటం వల్లే కరోనా సోకిన పరిణామాలను ఒక ఉదాహరణగా వివరించారు. హైదరాబాద్​లో ఉన్న వాళ్లకు కరోనా వైరస్ రాదని చెప్పిన డిప్యూటీ స్పీకర్ పద్మారావుకే కొవిడ్ సోకడం ఆ సమయంలో చర్చనీయాంశమైంది.

మంత్రి కేటీఆర్ చెప్పినప్పటికీ...

గతంలో పద్మారావు నిర్వహించిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆ సందర్భంగా ఉపసభాపతికి మంత్రి కేటీఆర్ మాస్క్ ఇచ్చినప్పటికీ ఆయన తిరస్కరించారు. ఈ క్రమంలో భాగ్యనగర వాసులకు కరోనా రాదని చెప్పిన పద్మారావు మహమ్మారి బారిన పడ్డారు. అయినప్పటికీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పద్మారావు వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్​లో ఉంటున్న ఆయన.. సోమవారం జరిగిన బోనాల పండుగ ఉత్సవాల్లో భాగంగా ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్నారు.

మాస్క్ లేకుండా ప్రజల్లోకి..

వైరస్ సోకి హోమ్ క్వారంటైన్​లో ఉన్న పద్మారావు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఫలహారం బండి ఊరేగింపు వద్ద కొబ్బరికాయలు కొట్టారు. మాస్క్ ధరించకుండానే మళ్లీ ప్రజల్లో తిరిగి.. స్థానికులకు ఆందోళన కలిగించారు. ప్రజలకు జాగ్రత్తలు సూచించాల్సిన నేతలే ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి:

'సుప్రీం తీర్పు ఓ మైలురాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మారాలి'

ABOUT THE AUTHOR

...view details