లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. నివాళులు అర్పించారు. రాష్ట్రానికీ, దేశానికీ బాలయోగి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సామాన్య దళిత కుటుంబంలో పుట్టి లోకసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన అసాధారణ ప్రతిభాశాలి బాలయోగి అని చంద్రబాబు కొనియాడారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, కోనసీమ అభివృద్ధికి బాలయోగి స్ఫూర్తిదాయకమైన సేవలందించారని లోకేశ్ గుర్తుచేశారు. తెలుగువారి ప్రతిభను చాటుతూ లోక్సభ స్పీకర్ హోదాలో దేశ రాజకీయాల్లోనే ఒక ధ్రువతారగా బాలయోగి ఎదిగారని కొనియాడారు.