కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్న పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి వేసిన ఈ పిటిషన్పై విచారణ ప్రారంభించిన న్యాయస్థానం...10 రోజుల్లోగా పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు 10 రోజులకు వాయిదా వేసింది.
రాజధాని తరలింపుపై 10రోజుల్లో సమాధానం ఇవ్వండి: హైకోర్టు
కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పది రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కార్యనిర్వాహక రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ
Last Updated : Apr 24, 2020, 1:04 PM IST