ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 21, 2021, 5:29 PM IST

ETV Bharat / city

న్యాయస్థానాలు అండగా నిలుస్తాయన్న నమ్మకం ఉంది: అమరావతి రైతులు

ప్రభుత్వాలు మోసం చేసినా.. న్యాయస్థానాలపై నమ్మకం కోల్పోలేదని అమరావతి మహిళలు, రైతులు స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ.. ఆందోళనకారులు అబ్బరాజుపాలెంలో పోలేరమ్మకు పొంగళ్లు సమర్పించారు. నిరసనలు మొదలుపెట్టిన 460వ రోజూ అదే సంకల్పంతో దీక్షలు కొనసాగించారు.

amaravati farmers protest reached 460 days
460వ రోజుకి చేరిన అమరావతి రైతుల ఉద్యమం

460వ రోజు నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, మహిళలు

రాజధాని తరలింపును నిరసిస్తూ అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళన 460వ రోజుకి చేరింది. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, కృష్ణాయపాలెం, దొండపాడు, వెంకటపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెంలో నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

పరిపాలనా రాజధానిగా అమరావతే కొనసాగించాలంటూ.. అబ్బరాజుపాలెంలో మహిళలు, రైతులు పోలేరమ్మకు పొంగళ్లు సమర్పించారు. ప్రభుత్వాలు మోసం చేసినా.. న్యాయస్థానాలు తమకు అండగా నిలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details