నకిలీ పత్రాలతో హైదరాబాద్లోని ఓ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో రూ.1.39 కోట్ల మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పీఎమ్ఈజీపీ (ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం) పథకం కింద బ్యాంకులో నకిలీ ఇన్ వాయిస్లు, అగ్రిమెంట్ల పత్రాలతో 8 మంది రుణాలు తీసుకున్నారు.
సంబంధిత పత్రాలు నకిలీవని గుర్తించిన బ్యాంకు చీఫ్ రీజనల్ మేనేజర్ సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్కి చెందిన కీలక సూత్రధారి శ్రీనివాస్ నాయక్తో పాటు రవి అనే మరో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.