ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'నా పొలానికి పసుపు కప్పలు వచ్చాయి'

కర్నూలు జిల్లా ముకుందాపురం గ్రామంలో తెల్లవారుజామున ఓ మోస్తరు వర్షం కురిసింది. వాన తగ్గాక చిన్న వెంకటేశ్వర్లు అనే రైతు తన పొలానికి వెళ్లి చూడగా.. అక్కడ పసుపు రంగులో కప్పలు ఎగురుతూ కనిపించాయి.

By

Published : Jun 26, 2019, 7:10 AM IST

నా పొలంలో పసుపు కప్పలు పడ్డాయి

పొలంలో పసుపు కప్పలు... ఆశ్చర్యపోయిన రైతు

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ముకుందాపురం గ్రామంలో వర్షంతో పాటు పసుపు రంగులో కప్పలు కనిపించడం స్థానికులను వింతకు గురిచేసింది. చిన్న వెంకటేశ్వర్లు అనే రైతు పొలంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఓ మోస్తారు వర్షం కురిసింది. వాన తగ్గాక రైతు పొలానికి వెళ్లి చూడగా... పసుపు రంగులో కప్పలు ఎగురుతూ కనిపించాయి. ఇలాంటి కప్పలు తాను ఎన్నడు చూడలేదంటూ రైతు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details